ఏడాది చేతికి రూ.లక్ష...ఈజీగా లోన్

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 11:57 AM

ఏడాది చేతికి రూ.లక్ష...ఈజీగా లోన్

మోదీ సర్కార్ ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ కూడా వీటిల్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఇందులో చేరితే ప్రతి ఏడాది రూ.లక్షకు పైగా పొందొచ్చు. ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం.

పీఎం వయ వందన యోజన స్కీమ్‌ కేవలం 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఏడాదికి పెన్షన్ రూపంలో రూ.1.11 లక్షలు పొందొచ్చు. ఈ పథకం 2023 మర్చి వరకు అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.
60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. రూ.15 లక్షల వరకు ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ పథకాన్ని అందిస్తోంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే డబ్బులు కూడా మారతాయి.

నెలకు కనీసం రూ.1000 పెన్షన్ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.9250 పొందొచ్చు. దీనికి రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఏడాదికి రూ.1.11 లక్షలు వస్తాయని చెప్పుకోవచ్చు. పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ వంటి డాక్యుమెంట్లు అందిస్తే సరిపోతుంది. 3 ఏళ్ల తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి 10 ఏళ్లు.





Untitled Document
Advertisements