ఉద్యోగులకు తీపి కబురు అందించిన టాటా సంస్థ..

     Written by : smtv Desk | Tue, May 07, 2024, 11:50 AM

ఉద్యోగులకు తీపి కబురు అందించిన  టాటా సంస్థ..

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి గాను ఒక్కో షేరుకు రూ. 28 ఫైనల్ డివిడెంట్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫైనల్ డివిడెండ్ కు రికార్డు తేదీని ప్రకటించింది టీసీఎస్. మరోవైపు.. గత ఏడాదిలో ఈ స్టాక్ 21 శాతం లాభాన్ని అందించింది.
అంతేకాక కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తాజాగా డివిడెండ్ కి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించేందుకు కంపెనీ మే 16, 2024ని రికార్డు తేదీగా నిర్ణయించింది. త్వరలో జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల ఆమోదం లభిస్తే.. ఈ ఫైనల్ డివిడెండ్ జూన్ 04 న అర్హులైన షేర్ హోల్డర్లకు చెల్లించనున్నట్లు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఒక ఇండియన్ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ. టాటా గ్రూప్ కి చెందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 46 దేశాలలో 150 నగరాలలో సేవలందిస్తోంది. ముంబై కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నఈ సంస్థలో ప్రస్తుతం సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.





Untitled Document
Advertisements