రాబోయే ఎన్నికలలోఆ పార్టీ నుంచి పోటీ చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్యే

     Written by : smtv Desk | Tue, Jan 31, 2023, 03:14 PM

రాబోయే ఎన్నికలలోఆ పార్టీ నుంచి పోటీ చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్యే

ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలకు ముందు రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. వివిధ పార్టీల నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి మారుతూ రాజకీయాలు రసవత్తరంగా సాగుతాయి. ప్రస్తుతం ఏపీలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. వైసీపీ అధిష్ఠానంపై ఆయన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ను ట్రాప్ చేస్తున్నారంటూ ఆయన బహిరంగ విమర్శలు చేశారు. మరోవైపు కోటంరెడ్డి తన అనుచరులతో మాట్లాడినట్టుగా ఉన్న ఓ ఆడియో లీక్ అయింది. ఈ ఆడియో ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది.
తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని.. ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను తాను బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం షేక్ అవుతుందని.. కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల మేలు కోసమే తాను పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తన సన్నిహితులతో సమావేశం సందర్భంగా శ్రీధర్ రెడ్డి పై విధంగా స్పందిస్తూ పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు.





Untitled Document
Advertisements