అందం అభినయంతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న బొద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్ లో శతమానం భవతి సినిమా తో సౌత్ లో మోస్ట్ పాపులర్ నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మతెలుగుతో పాటు తమిళ మరియు మలయాళ భాషా చిత్రాల్లో కూడా వరుసగా నటిస్తోంది.అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకున్నది. సిద్దు జొన్నలగడ్డ అంతకు మునుపు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. ఇప్పుడు ఈ అమ్మడు ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డకు జోడీగా టిల్లు స్క్వేర్ (డీజే టిల్లు 2) సినిమాలో నటించింది. ఈ అమ్మడు తాజాగా మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే సమయంలో తమిళంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
తమిళ సూపర్ స్టార్ విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యింది. ఈ విషయం అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఇది కబడ్డీ ప్లేయర్ మానతి గణేష్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఒక వైపు పెద్ద హీరోలతో నటిస్తూ మరో వైపు చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అనుపమ తాజాగా ధృవ్ తో నటించేందుకు ఎంపిక అయిన నేపథ్యంలో కచ్చితంగా తమిళనాట మరింత బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏవిధంగా అన్ని భాషలలో నటిస్తూ తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది . ఇప్పటికే మేకర్స్ చాలా రోజు క్రితం సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్లో ఉన్న పోస్టర్ ఒకటి లాంఛ్ చేయగా.. ఆ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరి ఈ సినిమా అనుపమను ఏ రేంజ్ లోకి తీసుకెళుతోంది వేచిచూడాలి .