మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అనే వార్త వింటే ప్రేక్షకుల గుండెలలో ఏదో అనుభూతి కలుగుతుంది . బింబిసారా సినిమాతో ఎంట్రీ అయినా వశిష్ఠ తన కంటూ ఒక కీర్తిని సంపాదించుకున్నాడు . ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్తో కలిసి త్రిష నటిస్తోంది. ఈ సినిమాలో త్రిష డబుల్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఇంకా క్లారిటీ రాకుండానే మరో వార్త ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా ఎంట్రీ సన్నివేశంను అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ తో విజువల్ తో దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.భూమికి సంబందించిన సృష్టి, స్థితి, లయ లకు సంబంధించిన కొన్ని ఫాంటసీ సన్నివేశాలు మరియు చిరంజీవిని చాల పవర్ ఫుల్గా చూపించే విధంగా సన్నివేశం ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
వశిష్ఠ తనకు వచ్చిన ఈ మెగా ఆఫర్ ను సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోవాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నాడట. చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో చుపించాబోతున్నారు అని ఆ మధ్య చెప్పుకొచ్చాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ సినిమాకు గాను కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. అప్పట్లో హిట్లర్ సినిమా ఒక రేంజ్ లో ఆడింది అదే మాదిరిగా అన్న చెల్లిల అనుబంధంకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయట. సినిమా భారీ స్టార్ కాస్ట్ తో ఉంటుందని సమాచారం అందుతోంది.ప్రేక్షేకుల ముందుకు రావడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి . మెగాస్టార్ తన హిట్ సినిమాలలో ఇది కూడా అవుతుందేమో చూడాలి . తన నటనతో బ్లాక్ బస్టర్ చేసే సమయం ఎప్పుడో మరి .