" పరదా " చిత్రంలో సరికొత్తగా కనిపించనున్న అనుపమ పరమేశ్వరన్

     Written by : smtv Desk | Wed, Mar 13, 2024, 08:15 PM


ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు అన్ని ఇతర భాషల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ కి జోడీగా నటించేందుకు సైన్ చేసింది. తెలుగులో సిద్దు జొన్నలగడ్డ తో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది. ఆ సినిమా త్వరలో విడుదల అవ్వబోతుంది

మలయాళ హిట్ మూవీ ప్రేమమ్ లో నటించడం ద్వారా పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ అమ్మడు తెలుగులో అదే సినిమా రీమేక్ తో ఎంట్రీ ఇచ్చింది. తన అందంతో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది
అంత‌ర్జాతీయ దిగ్గ‌జాన్ని క‌దిలించిన ఈ బుట్ట బొమ్మా గత ఏడాది జూన్ లో 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో ఒక సినిమాకు అనుపమ పరమేశ్వరన్‌ కమిట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాకు 'పరదా' అనే విభిన్నమైన టైటిల్‌ ను ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది. విజయ్ డొంకాడ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్‌, రాగ్ మయూర్‌ ఇంకా పలువురు యంగ్‌ స్టార్స్ కనిపించబోతున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రాబోతున్న 'పరదా' సినిమా పై ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాని కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేస్తారా? లేక తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా చూడాలి. ఈ సినిమాలో అనుపమ కొత్తగా కనపడుతుంది అని ఆమె సన్నిహితులు అంటున్నారు.మరి అది ఎంత వరకు నిజమో చూడాలి .





Untitled Document
Advertisements