నిఖిల్ తో జతకట్టనున్న న‌భాన‌టేష్.. ఈ చిత్రం కొరకు లుక్ మార్చుకోబోతుందా?

     Written by : smtv Desk | Thu, Mar 14, 2024, 04:17 PM

నిఖిల్ తో జతకట్టనున్న న‌భాన‌టేష్.. ఈ చిత్రం కొరకు లుక్ మార్చుకోబోతుందా?

టాలీవుడ్ లోకి న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన న‌భాన‌టేష్ ఇస్మార్ట్ శంక‌ర్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్న‌ విషయమ తెలిసిందే, ఆతర్వాత డిస్కో రాజా, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, అల్లుడు అదుర్స్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్ అయ్యాయి చివరగా తెలుగులో 2021లో రిలీజైన నితిన్ మాస్ట్రో లో క‌నిపించింది న‌భాన‌టేష్‌.
ఆ త‌ర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంటర్ అయి యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా పాన్ ఇండియాలో పిరియాడిక్ చిత్రం 'స్వ‌యంభు' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భ‌ర‌త్ కృష్ఱ‌మాచారి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి. నిఖిల్ లుక్... ఆ పాత్ర కోసం నిఖిల్ ప‌డిన క‌ష్టం కళ్ల ముందు క‌నిపిస్తుంది. ఈ పాత్ర కోసం నిఖిల్ ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అయ్యాడు.
మార్ష‌ల్ ఆర్స్ట్..గుర్ర‌పు స్వారి..క‌త్తి యుద్దం ఇలా పాత్ర కి అస‌ర‌మైన అన్నింటా త‌ర్పీదు పొందాడు. ఇక నిఖిల్ స‌ర‌స‌న ఇద్ద‌రు కథ నాయిక‌లు న‌టిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే రివీల్ చేసారు. ఓ హీరోయిన్ గా సంయుక్తా మీన‌న్ తీసుకున్నారు. కానీ రెండ‌వ హీరోయిన్ ఇంత‌వ‌ర‌కూ ఫైన‌ల్ కాలేదు. షూటింగ్ మొద‌లైనా రెండ‌వ హీరోయిన్ ఎవ‌రు? అన్న దానిపై నిన్న‌టివ‌ర‌కూ క్లారిటీ రాలేదు. తాజాగా ఆ హీరోయిన్ కూడా ఫిక్స్ అయింది. హాట్ హాట్ బ్యూటీ న‌భా న‌టేష్ ని మ‌రో నాయిక‌గా ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.
ఈ పాత్ర కోసం కొంత మంది కొత్త భామల్ని ప‌రిశీలించిన అనంత‌రం న‌భా అయితే స‌రితూగుతుంద‌ని ఆమెని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ రెండు పాత్ర‌ల‌కు చాలా ప్రాముఖ్య‌త ఉందంటున్నారు. క‌థ‌లో భాగంగానే ట్రావెల్ అవుతాయి త‌ప్ప స్టోరీ ఎక్క‌డా డివీయేట్ చేయ‌వ‌ని చిత్ర వ‌ర్గాల చెబుతున్నాయి. ఈ సినిమాలో సంయుక్తా..న‌భా న‌టేష్ ఎంపిక అన్న‌ది ఇద్ద‌రికీ ల‌క్కీ ఛాన్స్ అనే చెప్పాలి. సంయుక్తా ఇప్ప‌టికే స‌క్స‌స్ పుల్ న‌టిగా దూసుకుపోతుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో పాన్ ఇండియా చిత్రంలో ఛాన్స్ ద‌క్కించుకుంది.
ఇక న‌భా న‌టేష్ కెరీర్ కొంత న‌త్త న‌డ‌క‌న సాగుతుంది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత అమ్మ‌డి పేరు మ‌ళ్లీ వినిపించలేదు. ఈ అమ్మడుకి అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలే ఏకంగా పాన్ ఇండియా చిత్రంలోనే ఛాన్స్ అందుకుంది. సినిమా స‌క్సెస్ అయితే మాత్రం ఇద్ద‌రి రేంజ్ మారిపోతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి న‌భా న‌టేష్ కూడా సినిమా కోసం ప్ర‌త్యేకంగా రెడీ అవుతుందా? అన్న‌ది చూడాలి. ఎందుకంటే సంయుక్తా కూడా పాత్ర‌కు అవ‌స‌రం మేర కొంత శిక్ష‌ణ తీసుకుంది. మ‌రి న‌భా న‌టేష్ కూడా ట్రైనింగ్ తీసుకుంటుందా ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధం గా ఉందా ?లేదా?అనే విషయం తెలియాల్సింది ఉంది . ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అయి ప్రేక్షకులముందుకు వస్తుందో చూడాలి .





Untitled Document
Advertisements