త్వరలోనే ఇటీవల పెళ్ళితో ఒకటైన ఆ సెల‌బ్రిటీ కపుల్ విడిపోతారు.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి

     Written by : smtv Desk | Thu, Mar 14, 2024, 04:21 PM

త్వరలోనే ఇటీవల పెళ్ళితో ఒకటైన ఆ సెల‌బ్రిటీ కపుల్ విడిపోతారు.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి

ప్రస్తుత కాలంలో పెళ్లి చేయాలి అన్న ఏ శుభకార్యం చేయాలి అన్న జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్తుంటారు . అయితే దీని గురించి అందరూ నమ్మే వాళ్ళు ఉండరు . ప్ర‌ముఖ‌ జ్యోతిష్యుడు వేణు స్వామి గారు న‌న్ను న‌మ్మేవాళ్లు న‌మ్ముతారు.. న‌మ్మ‌ని వాళ్ల గురించి నేను ప‌ట్టించుకోను'' అని అంటున్నారు . కొత్త‌గా పెళ్ల‌యిన‌ సెల‌బ్రిటీ క‌పుల్స్ విష‌యంలో ఆయ‌న జోశ్యం ఫ‌లించ‌డంతో అత‌డి వాక్కు, శాస్త్ర ప‌రిజ్ఞానంపై ప్ర‌జ‌ల‌కు అపార న‌మ్మ‌కం ఏర్ప‌డింది. చాలా మంది క‌థానాయిక‌లు, న‌టీన‌టులు ఆయ‌న‌ను న‌మ్మి జ్యోతిష్యం చెప్పించుకునేందుకు వెళుతుంటారు. ఇందులో ప‌రిశ్ర‌మ అగ్ర తార‌లు ఎంద‌రో ఉన్నారు.
ఇంత‌కుముందు అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత జంట‌కు విడాకులు అవుతుంద‌ని, అఖిల్‌కి పెళ్ల‌వ‌దు.. కెరీర్‌ గండం ఎదుర్కొంటాడ‌ని నేనే చెప్పాను. నేను చెప్పిన‌దే జ‌రిగింది. జ్యోతిష్యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. స‌మంత - నాగ‌చైత‌న్య జంట‌ను చూశాక.. నాతో జోశ్యం చెప్పించుకుని.. వాళ్ల‌ను చూసి పెళ్లి చేసుకోని జంట‌లు చాల మంది ఉన్నారు. నా ద‌గ్గ‌ర‌కు కాబోయే దంప‌తులు ఇద్ద‌రూ వ‌చ్చి త‌మ గ్ర‌హ‌గ‌తుల గురించి అడిగి మ‌రీ తెలుసుకొని పెళ్లి చేసుకోలేదు... అని వేణుస్వామి అన్నారు. నా స‌క్సెస్ రేటు 98 నేను చెప్పిన‌వ‌న్నీ జ‌రిగాయి. నేను చెప్పిన‌ది నిజ‌మా కాదా తెలియాలంటే, టైమ్ కోసం వెయిట్ చేయాలి... అని కూడా అన్నారు.
ఈ మధ్య కాలంలో యూత్ లో కొత్త మార్పు వచ్చింది . ఇప్పుడు ఓ ప్ర‌ముఖ స్టార్ క‌పుల్‌పై అత‌డు చేసిన కామెంట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట విడిపోతార‌ని ముందే చెప్పిన వేణు స్వామి.. ఇటీవ‌ల పెళ్ల‌యిన ఒక సెల‌బ్రిటీ క‌పుల్ కొన్నాళ్ల త‌ర్వాత‌ విడిపోతారంటూ ఇప్పుడు జోశ్యం చెప్పారు. వ‌రుడికి నాగ‌దోషం ఉంది. వ‌ధువుకు గురు దోషం ఉంది. దీనివ‌ల్ల క‌లిసి ఎక్కువ కాలం కలిసి ఉండ‌రు.. అంటూ వేణు స్వామి జోశ్యం చెప్ప‌డంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. సెల‌బ్రిటీ జంట విడిపోవ‌డం ఖాయ‌మ‌ని ఘంటాప‌థంగా చెబుతున్నాడు వేణు స్వామి. త‌మ‌కు ఏమీ కాద‌ని భావించడమే ప్రేమ‌కు ఉన్న బ‌లం. ప్రేమికులు గుడ్డిగా పెళ్లి చేసుకుంటారు. ఆ త‌ర్వాతే స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి అని కూడా వ్యాఖ్యానించారు. ఆరేళ్ల ప్రేమాయ‌ణం త‌ర్వాత పెద్ద‌ల్ని ఒప్పించి ఆ సెల‌బ్రిటీ క‌పుల్ పెళ్లాడారు క‌దా? ఇంత‌లోనే విడిపోతార‌ని అంటారేమిటి? అంటూ స‌ద‌రు యాంక‌ర్ అడిగిన ఎదురు ప్ర‌శ్న‌కు.. శాస్త్రం ఫ‌లిస్తుంద‌ని వేణు స్వామి అన్నారు. న‌మ్మేవాళ్ల‌కు మాత్ర‌మే శాస్త్రం వంట‌ప‌డుతుంద‌ని కూడా అన్నారు. నేను చెబితే జ‌రిగి తీరాల్సిందేన‌ని కూడా ఘంటాప‌థంగా చెప్పారు.ఇప్పుడు తెలియాల్సింది ఆ జంట ఎవరు ?నిజంగానే విడి పోతారా ? జ్యోతిష్యం నిజమేనా?





Untitled Document
Advertisements