సీనియర్ స్టార్ హీరో బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ 80
ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుగ్గా ఉంటూ సినిమాలలో నటిస్తున్నారు. అటువంటి ఆయన ఉన్నట్టుండి అస్వస్థత కారణంగా ముంబయి కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలిలో రక్తం గడ్డ కట్టిన కారణంగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు!
నిన్న ఉదయం అమితాబ్ ఆసుపత్రిలో చేరినట్టు తెలియగానే, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. అభిమానులు తన కోసం ప్రార్థిస్తున్న విషయం తెలుసుకున్న అమితాబ్ సోషల్ మీడియా వేదికగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అమితాబ్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 ఏడీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని ఆసుపత్రి వర్గాలు కూడా స్పష్టం చేయడంతో అభిమానులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.