బాసర త్రిపుల్ ఐటి ఎంట్రెన్స్ నోటిఫికేషన్

     Written by : smtv Desk | Fri, Apr 26, 2019, 06:18 PM

బాసర త్రిపుల్ ఐటి ఎంట్రెన్స్ నోటిఫికేషన్

బాసర: శుక్రవారం బాసర త్రిపుల్ ఐటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ట్రిపుల్ ఐటిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 18 సంవత్సారలు మించరాదన్నారు. మొత్తం సీట్లలో రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 85 శాతం, ఇతర రాష్ర్టాల విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు విడతలవారీగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.





Untitled Document
Advertisements