నేడు తెరాస 18వ ఆవిర్భావ దినోత్సవం

     Written by : smtv Desk | Sat, Apr 27, 2019, 10:19 AM

నేడు తెరాస 18వ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. కొద్దిమందితో ప్రారంభం అయిన తెరాస కేంద్రంతో పోరాడి తన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా నేడు రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా నిలిచింది. ఈ సందర్భంగా తెరాస ప్రతీ ఏట మూడు రోజులపాటు అట్టహాసంగా ఆవిర్భావ సభలు నిర్వహించేది. కానీ ఈసారి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించింది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటారు. జిల్లా కార్యాలయాలలో పార్టీ నేతలు కూడా పార్టీ జెండాను ఎగురవేస్తారు.





Untitled Document
Advertisements