రైతులకు రూ.3 లక్షల రుణం...ఇలా పొందండి

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 06:57 PM

రైతులకు రూ.3 లక్షల రుణం...ఇలా పొందండి

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో అన్నదాతల కోసం కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6 వేలు పొందుతున్న వారు సులభంగానే లోన్ పొందే అవకాశం ఉంది.

పీఎం కిసాన్ స్కీమ్ లబ్దిదారులు కిసాన్ క్రెడిట్ కార్డు KCC సులభంగానే పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు లభిస్తాయి. బ్యాంకుకు వెళ్లి మీరు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పొలం పట్టా వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

కేసీసీ కార్డు ద్వారా గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. అయితే ఇందులో సబ్సిడీ రూపంలో తగ్గింపు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం 2 శాతం రాయితీ అందిస్తుంది. దీంతో వడ్డీ రేటు 7 శాతానకి దిగివస్తుంది. మీరు కరెక్ట్ టైమ్‌కి లోన్ చెల్లిస్తే.. అప్పుడు వడ్డీ రేటు మళ్లీ 3 శాతం తగ్గుతుంది. అంటే మీకు 4 శాతం వడ్డీ పడుతుంది.

అంటే ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. మీకు ఇప్పటికే కేసీసీ కార్డు ఉంటే లోన్ పొంది ఉంటారు. లేదంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఫిల్ చేసి, ఇతర డాక్యుమెంట్లతో కలిపి బ్యాంక్‌కు వెళ్లి ఇస్తే సరిపోతుంది.





Untitled Document
Advertisements