ఈ దెబ్బతో మైగ్రేన్ మటు మాయం

     Written by : smtv Desk | Wed, Sep 29, 2021, 05:16 PM

ఈ దెబ్బతో మైగ్రేన్ మటు మాయం

చేపల్ని ఎక్కువగా తినడం వల్ల మైగ్రెయిన్‌లూ తలనొప్పీ తగ్గుతాయని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఏజింగ్‌కు సంబంధించిన పరిశోధకులు పేర్కొంటున్నారు. దీనికోసం 200 మంది మైగ్రెయిన్‌ బాధితుల్ని తీసుకుని పరిశీలించారట. అందులో మొక్కజొన్న, సోయా, ఇతరత్రా నట్స్‌ ఎక్కువగా తిన్నప్పుడు ఆయా ఉత్పత్తుల్లోని లినోలిక్‌ ఆమ్లం వల్ల మైగ్రెయిన్‌ మరీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే- ఈ ఉత్పత్తుల్లోని లినోలిక్‌ ఆమ్లం సంబంధిత నాడిలో ఇన్‌ఫ్లమేషన్‌కి కారణమవుతుందట. అదే వాళ్లు లినోలిక్‌ ఆమ్లం ఉన్న ఉత్పత్తుల్ని తక్కువగా తీసుకుని, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేప, పీతలు వంటి సీ ఫుడ్‌ పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు నాడుల్లో ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్‌ కనిపించలేదట. దీన్నిబట్టి చేపల్ని ఆహారంలో భాగంగా చేసుకున్నవాళ్లలో తీవ్రమైన తలనొప్పి, మైగ్రెయిన్‌లు వచ్చే అవకాశం తక్కువని చెప్పుకొస్తున్నారు.





Untitled Document
Advertisements