క్యాచ్ వదిలేసి కోహ్లీని రనౌట్ చేసిన పరాగ్

     Written by : smtv Desk | Thu, Sep 30, 2021, 12:02 PM

క్యాచ్ వదిలేసి కోహ్లీని రనౌట్ చేసిన పరాగ్

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించని విధంగా రనౌటయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. ఫీల్డర్ రియాన్ పరాగ్ తప్పిదాన్ని సొమ్ము చేసుకోవాలని ఆశించిన కోహ్లీకి నిరాశే ఎదురైంది. అంతక ముందే కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని నేలపాలు చేసిన 19 ఏళ్ల రియాన్ పరాగ్.. తన తప్పిదాన్ని కళ్లు చెదిరే రనౌట్‌తో దిద్దుకున్నాడు. రిప్లై చూసే వరకూ నాటౌట్ అనే ధీమాతో కోహ్లీ నవ్వుతూ కనిపించాడు.

ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన క్రిస్ మోరీస్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఫుష్ చేశాడు. కానీ.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రియాన్ పరాగ్.. డైవ్ చేస్తూ బంతిని అడ్డుకున్నాడు. అయితే.. అతని చేతిని తాకిన బంతి కొద్దిగా పక్కకి వెళ్లింది. దాంతో.. సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని కేఎస్ భరత్‌ని కోహ్లీ పిలవగా.. అతను స్పందించి పరుగెత్తాడు. ఈ నేపథ్యంలో.. బంతిని చూస్తూ కోహ్లీ పరుగెత్తగా.. వేగంగా రియాక్ట్ అయిన పరాగ్.. లేచి బంతిని అందుకుని నాన్‌స్ట్రైక్‌లోని వికెట్లపైకి గురి చూసి విసిరాడు.

ఔట్‌పై నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌కి ఫీల్డ్ అంపైర్ నివేదించగా.. రిప్లైలో బంతి వికెట్లని తాకే సమయానికి క్రీజుకి కొద్ది దూరంలో విరాట్ కోహ్లీ ఉన్నట్లు కనిపించింది. దాంతో.. థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అప్పటి వరకూ నవ్వుతూ కనిపించిన కోహ్లీ.. రిప్లై చూసిన తర్వాత నిరాశగా పెవిలియన్‌ వైపు నడిచాడు. ఈ మ్యాచ్‌లో ఆఖరికి బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.






Untitled Document
Advertisements