ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్...ఇక ఏటీఎంలు కనిపించవు

     Written by : smtv Desk | Fri, Oct 01, 2021, 11:41 AM

ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్...ఇక ఏటీఎంలు కనిపించవు

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏటీఎంలు ఇక కనిపించవు. అక్టోబర్ 1 నుంచి బ్యాంక్ ఏటీఎంలు పని చేయవు. బ్యాంక్ అన్ని ఏటీఎంలను మూసివేయాని నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఇప్పటికే కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది.

ఏటీఎం సర్వీసులను నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కస్టమర్లు వారి డెబిట్ కార్డుల ద్వారా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నుంచి డబ్బులు తీసుకోవచ్చని సూచించింది. చాలా మంది తమ బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించడం లేదని, అందుకే ఈ సర్వీసులను నిలిపివేస్తున్నామని బ్యాంక్ తెలిపింది.

బ్యాంక్ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగానే లావాదేవీలు నిర్వహించొచ్చని సూర్యోదయ బ్యాంక్ ఎండీ ఆర్ భాస్కర్ బాబు తెలిపారు. డిజిటల్ లావాదేవీల కారణంగా తమ ఏటీఎంల వినియోగం తగ్గిందని పేర్కొన్నారు. కాగా ఈ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 26 ఏటీఎంలు, 555 బ్రాంచులు ఉన్నాయి.





Untitled Document
Advertisements