దశదినకర్మ లో పితృ దేవతలకు సమర్పించే వాయిస్ పిండాన్ని కాపులు ముట్టని పక్షంలో ఈ విధమైన వాగ్దానం చేస్తే గనుక కాకులు పిండాన్ని ముడతాయి.
చనిపోయిన వారికి దశదినకర్మలో మూడు పిండాలను అగ్నిహోత్రంలో వేసిగాని, నదిలో వేసిగాని, ఆవుకి పెట్టే గానీ సమర్పిస్తారు. చనిపోయిన వ్యక్తి కి ఇష్టమైన పదార్థాలు తయారుచేసి వాయస పిండం అన్న పేరుతో ఒక పిండాన్ని కాకులకు వేస్తారు. చనిపోయిన వ్యక్తికి ఏదైనా తీరని కోరిక ఉంటే ఆ వాయస పిండాన్ని కాకులు ముట్టుకోవని నమ్ముతాం. ఆ కోరిక తీరుస్తామని కర్మ చేసేవారు వాగ్దానం చేస్తే అప్పుడు ఆ పిండాన్ని కాకులు ముట్టుకుంటాయనే విశ్వాసంతో ఈ విధంగా చేయడం పరిపాటి..