జర్నలిస్ట్ హత్య కేసులో దోషిగా తేలిన డేరా చీఫ్...శిక్ష ఖరారు

     Written by : smtv Desk | Sat, Oct 09, 2021, 11:30 AM

జర్నలిస్ట్ హత్య కేసులో దోషిగా తేలిన డేరా చీఫ్...శిక్ష ఖరారు

లైంగిక వేధింపు కేసులో శిక్ష అనుభవిస్తోన్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ అలియాస్ డేరా బాబాను తాజాగా ఓ హత్య కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. డేరా బాబా ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ సహా పలువుర్ని కోర్టు దోషిగా తేల్చింది. దోషులకు అక్టోబరు 12న శిక్షలను ఖరారు చేయనుంది.డ డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10న హత్యకు గురయ్యారు. రంజిత్ హత్యకు డేరా బాబా సహా జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్‌లు కుట్ర పన్నినట్టు తేల్చింది.

డేరాలోని మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకుని గుర్మీత్ రామ్ రహీమ్ చేస్తున్న అరాచకాలను బయట ప్రపంచానికి తెలియజెప్పడానికి అజ్ఞాత వ్యక్తి పేరుతో లేఖ రాసినట్టు రంజిత్ సింగ్‌ను అనుమానించాడని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇదే లేఖను సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హైలట్ చేశారు.. అయితే, ఆయన కూడా హత్యకు గురయ్యారని తెలపింది. జర్నలిస్ట్ హత్య కేసులోనూ డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది.

హరియాణాలోని కురుక్షేత జిల్లా థానేసర్ పోలీస్ పరిధిలో 2002 జులై 10 రంజిత్ సింగ్ హత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయకపోవడంతో బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సీబీఐ విచారణకు హైకోర్టు నవంబరు 2003లో ఆదేశించింది. సీబీఐ విచారణతో డేరా బాబా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాకు 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. భక్తి ముసుగులో మహిళలను సెక్స్ బానిసలుగా మార్చినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న డేరా బాబా.. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని వెనకేసుకున్నాడు. భక్తి పేరుతో కారు చౌకగా భూముల్ని కొనుగోలు చేసి... తాను నంపుసుకులుగా మార్చిన భక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.





Untitled Document
Advertisements