యశోద చిన్ని కృష్ణుని తాడుతో ఎందుకు బంధించింది!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 01:22 PM

యశోద చిన్ని కృష్ణుని తాడుతో ఎందుకు బంధించింది!

గోపికలు కృష్ణుని ఆగడాలను విన్న కొద్దీ వినిపిస్తూ ఉంటే యశోదకు చిరాకుతో పాటు చిరు కోపం కూడా వచ్చింది. ఆమెకు కోపం, చిరాకు వచ్చిందన్న సంగతి కనిపెట్టిన నందుడు గోపకాంతలందరిని " కొంత అతిగా అల్లరి చేసి ఉంటాడు. నేను భయం చెప్పి అదుపులో పెడతాను. మీరు నిశ్చింతగా ఉండండి" అని వారిని ఊరడించి పంపించాడు.
యశోద మాత్రం కృష్ణుని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఆలస్యం అవుతున్న కొద్దీ యశోద కోపం ఎక్కువ అవుతోంది. కృష్ణుడు ఏమీ తెలియనట్లు అమ్మ ముందుకు వచ్చి నిలబడి, అమ్మ ఎందుకో కోపంగా ఉంది అని అన్నగారి వైపు చూశాడు. " కోపంగా ఎందుకు ఉన్నానా! ఆగు ఒక్క నిమిషం" అని యశోద చివాలున లేచి కృష్ణుని రెక్క పట్టుకొని పెరట్లోకి తీసుకెళ్ళి, ఒక పెద్ద తాడుతో కృష్ణుని నడుముకు ఒక కొస కట్టి, రెండవ కోసను అక్కడే ఉన్న పెద్ద రోలుకి కట్టేసి, నీ తిక్క రోగం ఇప్పుడు కుదురుతుంది అని తన మనసులోనే మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్లింది.





Untitled Document
Advertisements