శబరులు వీరు మ్లేచ్చ తెగకు చెందిన ప్రజలు. వీరు వశిష్టుని గోవు మలమూత్రాల నుండి జన్మించారు. సాత్యకి కౌరవసైన్యానికి దునమాడినప్పుడు శబరులు శవాల గుట్టలుగా పడ్డారు. అంతకు ముందు రోజుల్లో మాంధాత రాజ్యంలో వీరు దోపిడీదారులుగా జీవించారు. శివుడు ఒక సారి అటవికుడుగా మారినప్పుడు శబరుల రూపంలో ఉన్నాడు. పరశురాముడు క్షత్రియుల్ని అందర్నీ సంహరించే సమయంలో వీరు కొందరు గుహల్లో దాక్కొని క్షత్రియులతో సంబంధాలు తెగిపోయాయి శబరులయ్యారు. నిజానికి వీరు క్షత్రియ వంశానికి చెందినవారు.