అక్షయ తృతీయ ముందు తగ్గిన బంగారం

     Written by : smtv Desk | Mon, May 02, 2022, 10:53 AM

అక్షయ తృతీయ ముందు తగ్గిన బంగారం

నేడు గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. సిల్వర్ రేట్లలో ఎలాంటి మార్పులేదు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ కేవలం రూ.10 మాత్రమే తగ్గి రూ.48,390గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ కూడా కేవలం రూ.10 మేరనే తగ్గి రూ.52,790గా నమోదైంది. మరోవైపు సిల్వర్ రేట్ ఏమాత్రం మారలేదు. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.69,500గా ఉంది. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు ఈ విధంగానే నమోదయ్యాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ రూ.10 తగ్గి రూ.48,390గా రికార్డయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ రూ.52,790 వద్ద ఉంది. ఢిల్లీలో కూడా వెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.63,500గా ఉంది.
మరోవైపు ధరలు కాస్త తగ్గి ఉండటంతో పాటు రేపు అక్షయ తృతీయ కావడంతో గోల్డ్ జ్యూవెల్లరీ ఓనర్లు ఈసారి అమ్మకాలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. కరోనా మహమ్మారి తర్వాత రెండేళ్ల పాటు పెద్దగా వ్యాపారాలు సాగకపోవడంతో.. వీరు బాగా దెబ్బతిన్నారు. కానీ ఈసారి తగ్గి ఉన్న ధరలు, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌తో కస్టమర్ల రాక పెరుగుతుందని ఆశిస్తున్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ అనేది కస్టమర్లకు తొలి ఎంపికగా ఉంటుందని ఆ తర్వాత డైమండ్, సిల్వర్ జ్యూవెల్లరీని కొంటారని పేర్కొంటున్నారు. అంతేకాక జ్యూవెల్లరీ స్టోర్లు కూడా బంగారం కొనుగోళ్లపై బంపర్ ఆఫర్ ప్రకటించాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు ఇవ్వడం, ఉచితంగా గోల్డ్ కాయిన్లు వంటి వాటిని తీసుకొచ్చాయి. అలాగే ఆన్‌లైన్ అమ్మకాలను కూడా అందిపుచ్చుకోవాలని చూస్తున్నాయి.





Untitled Document
Advertisements