అనవసరంగా జగన్ లండన్ కి ఎందుకు వెళ్లారు.. అయ్యన్నపాత్రుడు

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 01:11 PM

అనవసరంగా జగన్ లండన్ కి ఎందుకు వెళ్లారు.. అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల దావత్ కు వెళ్తున్నాం అని చెప్పి లండన్ కి వెళ్లారు సీఎం జగన్. అయితే ఈ సందర్భంగా దృష్ట్యా అయ్యన్నపాత్రుడుజగన్ పై కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ కు ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. అయితే జగన్ వెళ్లిన ఫ్లైట్ కేవలం ప్రపంచంలోని అత్యధిక ధనవంతులు మాత్రమే ప్రయాణానికి వాడుతారు అని ఆ విమానం ఖర్చు గంటకు దాదాపుగా 12 లక్షలు గా ఉంటుందని కేవలం ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి జగన్ ఇలా లండన్ కు మద్యంతర పర్యటన అనవసరం అని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. లండన్‌కు దాదాపు 13- 14 గంటల సమయం పడుతుందని.. అంటే, విమానం ఖర్చే దాదాపుగా కోటిన్నర అవుతుందన్నారు. సీబీఐ కోర్టులో దావోస్‌కు వెళ్తున్నానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. లండన్ వరకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను అయ్యన్నపాత్రుడు షేర్ చేశారు.

https://twitter.com/AyyannaPatruduC/status/1527874098650845184?t=hx3ZjAM0r0okub_CRRNG0Qs=19





Untitled Document
Advertisements