తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 06:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రిపై  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్

తెలంగాణ పార్లమెంటు సభ్యులు మాజీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ వెళ్లారు అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు మూడు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ తెలంగాణ లోని రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా మీ బాధ్యత గుర్తు రాలేదా అంటూ నిలదీశారు. తెలంగాణలో రైతులు లేరా అన్న విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. అంతేకాక గత ఎన్నికల లాగానే ఈసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్లి వచ్చే ఏడాది మే నెలలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలమైన మెజార్టీతో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లా లోనే కాంగ్రెస్ పార్టీ 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements