గోమాంసం తినాలి అనిపిస్తే తినేస్తా.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 11:35 AM

గోమాంసం తినాలి అనిపిస్తే తినేస్తా.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

ఆవు మాంసం ఆహారంగా స్వీకరించడం విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో గో మాంసం విక్రయాలు నిషేధం దృష్ట్యా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని తుమకూరు లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య ఆర్ఎస్ఎస్ తీరును నిరసిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని తనకి గో మాంసం తినాలని అనిపిస్తే తింటాను అని ఎవరికి భయపడేది లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఎప్పుడూ గో మాంసం తినలేదు కానీ నాకు తినాలనిపిస్తే తింటాను అని పదేపదే నొక్కి చెప్పారు. కేవలం ముస్లింలు మాత్రమే గో మాంసాన్ని తీసుకోరు.. గో మాంసం తినే హిందువులు కూడా ఉంటారని .. క్రిస్టియన్లు కూడా ఆవు మాంసాన్ని ఆహారంగా సేకరిస్తారని స్పష్టం చేస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేవలం మతపరమైన అల్లర్లు రెచ్చగొట్టడానికి గోమాంసం అనే అంశాన్ని తెరమీదికి తీసుకు వస్తుందని ఆర్ఎస్ఎస్ తీరుపై మండిపడ్డారు. అంతేకాక ఈ విషయాన్ని తాను గతేడాది అసెంబ్లీలో కూడా చర్చించానని తెలియజేశారు.





Untitled Document
Advertisements