అర్షమొల్లలకు, హైబీపీకి కరివేపాకుతో చెక్!

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 04:04 PM

అర్షమొల్లలకు, హైబీపీకి కరివేపాకుతో చెక్!

కరివేపాకులోని ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన భారతీయ ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కరివేపాకు చెట్టును కొంతమంది ఇంటి ఆవరణలోనే పెంచుతారు. దీని ఆకులతో కూరలకు, సాంబార్ కు రుచి ఎంతో పెరుగుతుంది. దీని యొక్క ఉపయోగాలు తెలిసినా కూడా కొంతమంది దానిని తినకుండా పక్కన పెడుతున్నారు. కానీ పచ్చి ఆకులను తిన్నా కూడా ఉపయోగం ఉంటుంది. కరివేపాకులో మందు లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కరివేపాకు పచ్చడి చేస్తారు. పొడి తయారు చేసుకొని కూడా వాడుతారు. కరివేపాకు హై. బీ.పీ ని అదుపులో వుంచుతుంది. కరివేపుకుతో ఎలాంటి జబ్బులకు చెక్ పెట్టొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
* 50 గ్రాములు కరివేపాకు దంచి మజ్జిగలో పరగడుపున తాగితే జిగట విరేచనాలు,రక్త విరేచనాలు తగ్గిస్తుంది .
* 50 గ్రాముల కర్వేపాకు మెత్తగా దంచి మజ్జిగలో కలిపి పరగడుపున తాగితే అల్సర్ ను బాగా తగ్గిస్తుంది.
* లేత కరివేపాకు తేనెలో కలిపి తింటే మంచి విరేచనకారి అర్షమొల్లలకు మంచి మందుగా పనిచేస్తుంది.
* కరివేపాకు నీడలో ఆరబెట్టి పొడి చేసి ఉదయం 1 స్పూన్, సాయంకాలం ఒక టీస్పూన్ నీటిలో కలిపి తాగితే  అర్షమొల్లలకు తగ్గుతాయి.
* కరివేపాకు కాయకు నిమ్మరసం కలిపి దంచి, విషం తాగిన వారికి నీటిలో కలిపి తాగితే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.
* పది పదిహేను కరివేపాకులు పరగడుపున నమిలి మింగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* కరివేపాకుతో అజీర్ణం దూరం చేయును. అదేవిధంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
* కరివేపాకు దంచి గజ్జిపై పెడితే గజ్జి తగ్గుతుంది.
* కొబ్బరి నూనెలో కరివేపాకు మరిగించి చల్లారిన తరువాత వడగట్టి రోజు తలకు రాస్తే జుట్టు నల్లగా మారుతుంది.
* కరివేపాకు క్రమం తప్పకుండా ఆహారంలో ఎక్కువగా తింటే వెంట్రుకలు నిలబడతాయి.
* కరివేపాకు పొడి తింటే డిసెంట్రీ, డయేరియా తగ్గుతుంది. కరివేపాకు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.





Untitled Document
Advertisements