గురువారం మహబూబాబాద్ లోని అడ్వకేట్స్ కాలనీలో ఒక వ్యక్తి కోసి పరారయ్యాడు. పదునైన కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పేరు కల్పన. ఆమె భర్త పేరు భాస్కర్. అతను మటన్ షాపులో పనిచేస్తున్నాడు. అతని భార్య కల్పన ఇళ్ళల్లో పని చేస్తుంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆమెపై అనుమానంతో భాస్కర్ ఆమెని చంపినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భాస్కర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.