బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ.. తల్లి వద్దకు చేర్చిన పోలీసులు

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 05:25 PM

బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ.. తల్లి వద్దకు చేర్చిన పోలీసులు

ఎంతో రద్ధీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడాది బాబు కిడ్నాప్‌కు గురైన కేసును పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. బాబు కిడ్నాప్‌కు గురైన సమాచారాన్ని అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ ఆధారంగా బాబును అపహరించిన మహిళను గుర్తించి, ఆమె ఆటో ఎక్కడికి వెళ్లిందని తెలుసుకుని బాబును క్షేమంగా తల్లికి అందించారు. కిడ్నాప్ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించడంపై పోలీసులకు ప్రత్యేక అభినందనలు అందుతున్నాయి.
ఓ ఒంటరి మహిళ గుంటూరు నుంచి సికింద్రాబాద్ బాబుతో వచ్చింది. రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా మహిళ బాబుతో ఉండటాన్ని గమనించిన మరో మహిళ ఆమెతో కలిసి ఉంటూ బాబుకి బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంది. తల్లి వాష్ రూమ్‌కి వెళ్లగానే వెంటనే మహిళ బాబును తీసుకుని పరారైంది. వాష్ రూమ్ నుంచి వచ్చిన మహిళకు తన బాబు, పక్కనే ఉన్న మహిళ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో కేసు నమోదు చేసిన ఆర్ఫీఎఫ్ పోలీసులు.. వెంటనే బాబు కోసం గాలించడం మొదలుపెట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు బాబును కిడ్నాప్ చేసిన మహిళ కదలికల ఆధారంగా ఆమె ఎక్కిన ఆటోను గుర్తించారు. ఆ ఆటోను కవాడీగుడలో పోలీసులు ఛేదించారు.. అక్కడ స్థానికుల సమాచారంతో పోలీసులు బాబును మహిళ నుంచి క్షేమంగా తల్లి వద్దకు చేర్చారు.





Untitled Document
Advertisements