రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న తెలంగాణకు చేరుతుంది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.అక్టోబర్ 4న కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ హైదరాబాద్ వస్తారని ఆయన మీడియాతో అన్నారు. కాంగ్రెస్ నేతలు, తెలంగాణ మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసమస్యలపై పోరాడుతున్న నేతలు పాదయాత్రలో రాహుల్తో సంప్రదింపులు జరుపుతారని ఆయన వివరించారు. ఆదివారం డీజీపీని కలిసి రూట్ మ్యాప్ సమర్పించి రాహుల్ యాత్రకు అనుమతి కోరనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. పాదయాత్రకు పార్టీ క్యాడర్ను సమీకరించేందుకు సబ్కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, భారత్ జోడో యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణకు నాన్లోకల్ అని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో నేను చురుగ్గా పాల్గొన్నప్పుడు కేటీఆర్ ఏపీలోని గుంటూరులో చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని ఆయన అన్నారు.