మాయ మాటలతో ఏడు పెళ్ళిళ్ళు చేసుకున్న కిలాడీ లేడీ ..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 02:55 PM

మాయ మాటలతో ఏడు పెళ్ళిళ్ళు చేసుకున్న కిలాడీ లేడీ ..

మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుని ఒకరికి తెలియకుండా ఇంకొరిని అన్నట్లు ఏకంగా ఏడుగుర్ని వివాహం చేసుకుని మోసం చేసింది. వీరిలో ఓ బాధితుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి శివ అనే వ్యక్తి దగ్గర పనికి చేరింది. అతడికి బాగా దగ్గరుకాగా పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో వీరిద్దరు 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకున్నారు.
వీరిద్దరు విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. శివ ఓ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేసేవాడు. అతడికి వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్‌ నుంచి ఆమె అకౌంట్‌కు బదిలీ చేసుకునేదని బాధితుడు చెబుతున్నారు. పిత్రార్జితంగా వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరంట్ల దగ్గర డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో 12 సెంట్ల ఖాళీ స్థలం ఆమె పేరు మీదకు మార్చుకుందని శివ చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా ఆమె ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్‌లో ఉన్న సొమ్ము తీసుకుని తనను వదిలి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఆమెపై గుంటూరు, భీమవరం పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశానని చెబుతున్నారు. ఆమె గురించి ఆరా తీస్తే భీమవరంలో ఇద్దరు, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒకరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదానగర్‌లో ఒకరు, గుంటూరు డొంకరోడ్డులో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగిని మోసగించినట్లు తనకు తెలిసిందన్నారు.
ఈ మహిళ డబ్బున్న వారిని గుర్తించడం వారి దగ్గర పనుల కోసం చేరుతున్నట్లు బాధితుడు చెబుతున్నారు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటని ఇలా చాలామందిని మోసం చేసినట్లు తనకు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements