ఎకో ఫ్రెండ్లీ వివాహ వేడుక.. ఆకట్టుకుంటున్న ఆహ్వాన పత్రిక

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:19 AM

ఎకో ఫ్రెండ్లీ వివాహ వేడుక.. ఆకట్టుకుంటున్న ఆహ్వాన పత్రిక

ప్రముఖ జంట అలీ ఫజల్, రిచా చద్దా ఈ సంవత్సరం అక్టోబర్ 4 న వివాహం చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అగ్గిపెట్టె ఆకారంలో ఉన్న ఈ పెళ్లి పత్రిక పై బ్రాండ్ పేరు ఉండే చోట కపుల్ మ్యాచెస్ అని రాసి ఉంది. అలీ ఫజల్, రీచా చద్దా లు సైకిల్ తొక్కుతున్న ఫోటోలు ముద్రించారు. ఒకప్పుడు అగ్గిపెట్టెలకు అచ్చు గుద్దినట్లు ఉన్న ఈ వివాహ ఆహ్వాన పత్రిక అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇక వీరి వివాహం ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో జరగనున్నట్టు సమాచారం. పెళ్లి అనంతరం ఢిల్లీతో పాటు ముంబైలో విందులు ఏర్పాటు చేశారు. ముంబైలో జరిగే వివాహ విందుకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరుకానున్నారు.
అంతే కాకుండా వీరు 2015 నుంచి అలీ, రీచా డేటింగ్ లో ఉన్నారు. ఓ షూటింగ్ నిమిత్తం కలుసుకున్న వీరిద్దరూ.. తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. 2017లో తమ బంధం గురించి ప్రపంచానికి చెప్పారు. వాస్తవానికి 2020 లోనే ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. కోవిడ్, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే వీరు తమ పెళ్లిని కని విని ఎరుగని స్థాయిలో చేసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే తమ ప్రత్యేకతను వివాహ ఆహ్వాన పత్రిక ద్వారా చాటి చేప్పారు.





Untitled Document
Advertisements