ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఓ వ్యక్తి వాటర్ బాటిల్తో కేజ్రివాల్ పై దాడికి ప్రయత్నించాడు. అయితే కేజ్రీవాల్ పై విసిరిన వాటర్ బాటిల్ ఆయనకు తగలలేదు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ కూడా అంతగా పట్టించుకోలేదు. గుజరాత్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా గుజరాత్ లో పట్టు సాధించాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్నారు. నిన్న రాజ్కోట్లోని ఖోదల్ధామ్ ఆలయంలో నిర్వహించిన గార్భా వేడుకలకు హాజరయ్యారు. కేజ్రీవాల్ పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.