నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అదానీ గ్రూపును నేడు కూడా వెంటాడిన నష్టాలు

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 04:43 PM

నేడు లాభాల్లో  ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అదానీ గ్రూపును నేడు కూడా వెంటాడిన నష్టాలు

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500కి పెరిగింది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 17,649 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్, టెలికామ్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. అదానీ గ్రూపు షేర్లు ఈ రోజు కూడా పతనమయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: బజాజ్ ఫైనాన్స్ (4.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.51%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.22%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.85%), ఎన్టీపీసీ (1.53%).

టాప్ లూజర్స్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.38%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.56%), ఎల్ అండ్ టీ (-2.11%), టాటా స్టీల్ (-1.62%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.55%).





Untitled Document
Advertisements