8వ రోజుకు చేరుకున్న నారా లోకేశ్ పాదయాత్ర..

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 11:13 AM

8వ రోజుకు చేరుకున్న నారా లోకేశ్ పాదయాత్ర..

యువగళం పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కుప్పంలో మొదలై నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. నేటి ఉదయం మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో కాసేపటి క్రితం బలిజపల్లి గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు. రాత్రికి ఆయన వజ్రాలపురం విడిది కేంద్రంలో బస చేస్తారు. ఇప్పటి 88.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. నిన్న లోకేశ్ 16.2 కిలోమీటర్లు నడిచారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్:

ఉదయం 9.00 గంటలకు మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
10.15 గంటలకు బలిజపల్లి గ్రామస్తులతో భేటీ
11.40 గంటలకు శేషాపురంలో మహిళలతో ముఖాముఖి
12.50 గంటలకు వెంకటగిరిలో భోజన విరామం
సాయంత్రం 3.50 గంటలకు వెంకటగిరి నుంచి పాదయాత్ర ప్రారంభం
4.35 గంటలకు వెంకటగిరి జామియా మసీదులో ప్రార్థనలు
5.00 గంటలకు బంగారుపల్లి జంక్షన్ లో బహిరంగసభ
7.45 గంటకు వజ్రాలపురం విడిది కేంద్రంలో బస.





Untitled Document
Advertisements