దిగ్గజాల సరసన పుజారా

     Written by : smtv Desk | Sat, Mar 11, 2023, 04:20 PM

దిగ్గజాల సరసన  పుజారా

టీమిండియా టెస్టు జట్టులో నిలకడకు మారుపేరుగా నిలిచే ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అహ్మదాబాద్ టెస్టులో పుజారా 42 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఇప్పటివరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ మాత్రమే 2 వేల పరుగుల ఘనత అందుకున్నారు. ఇప్పుడు పుజారా కూడా దిగ్గజాల సరసన చేరాడు. పుజారా ఈ ఘనతను 24 టెస్టుల్లో అందుకున్నాడు.





Untitled Document
Advertisements