నేడు మోదీ, అమిత్ షాలతో జగన్ బేటీ

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 11:48 AM

నేడు మోదీ, అమిత్ షాలతో జగన్ బేటీ

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. నేడు అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ అవనున్నారు. అయితే ఉన్నట్టుండి ఉన్నట్టుండి హస్తినకు బయల్దేరనుండటం ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు జగన్ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, రాష్ట్ర సమస్యలను మోదీ, అమిత్ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. కొందరు కేంద్ర మంత్రులతో కూడా జగన్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వెలువడే వరకు జగన్ పర్యటనకు గల కారణాల పై స్పష్టత రావడం కష్టం.





Untitled Document
Advertisements