పనిపట్ల అంకిత భావంతో ఉండే వ్యక్తులు అరుదు, ముందు మనం దైవంలా నమ్మే పని ఆ తరువాతే ఏదైనా చివరికి కుటుంబం సైతం అనుకునే వారు మనకు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అటువంటి ఓ వ్యక్తి గురించి ప్రధాని మోదీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ కార్యకర్త ఒకరు చేసిన పనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిదా అయ్యారు. సోమవారం ఇద్దరు ట్విన్స్కు తండ్రి అయిన ఆ కార్యకర్త పిల్లలను చూడడానికి ముందు చెన్నై విమానాశ్రయానికి వెళ్లి మోదీని కలిశారు. విషయం తెలిసిన ప్రధాని సోషల్ మీడియా పోస్టులో కార్యకర్తపై ప్రశంసలు కురిపించారు. అంకితభావంతో కూడిన ఇలాంటి కార్యకర్తలు పార్టీలో ఉన్నారని కొనియాడారు.
‘‘ఇది చాలా ప్రత్యేకమైన ఇంటరాక్షన్. చెన్నై విమానాశ్రయంలో మా కార్యకర్తల్లో ఒకరైన శ్రీ అశ్వంత్ పిజై జీ నాకు స్వాగతం పలికేందుకు వచ్చారు. ఆయన భార్య ఇప్పుడే కవలలకు జన్మనిచ్చింది. అయినప్పటికీ వారిని ఇంకా కలవలేదని చెప్పాడు. అయితే, ఇక్కడకు వచ్చి ఉండకూడదని ఆయనకు చెప్పాను. ఆయనకు, ఆయన కుటుంబానికి నా ఆశీర్వాదాలు తెలియజేశాను’’ అంటూ తమిళంలో ‘ఎక్స్’ చేశారు. ప్రధాని పెట్టిన ఈ పోస్ట్ పై నేట్టిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు.
https://twitter.com/narendramodi/status/1764676987854139555?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1764676987854139555%7Ctwgr%5E768d4031510fe2b035f5ad88062194f9f076cd64%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F795445%2Fpm-modi-gets-emotional-as-bjp-worker-receives-him-before-seeing-his-newborns