ప్రధాని భాదపడతారని దీదీ భయపడుతుంది.. కాంగ్రెస్ విమర్శలు

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 09:28 AM

ప్రధాని భాదపడతారని దీదీ భయపడుతుంది.. కాంగ్రెస్ విమర్శలు

లోక్ సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాలు అట్టుడికి పోతున్నాయి. అధికార బీజీపీ ఈసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం విధితమే. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈసారి అధికారం చేజ్జిక్కించు కోవాలని పావులు కదుపుతుంది. కమలనాధులను ఓడించేందుకు ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. విపక్షాల ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధానమంత్రి బాధపడతారేమోనని మమతా బెనర్జీ భయపడుతున్నారని హస్తంపార్టీ విమర్శించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో గౌరవప్రదమైన సీట్ల భాగస్వామ్య ఒప్పందం కోసం కాంగ్రెస్ పదేపదే ప్రయత్నించిందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని చర్చల ద్వారా ఖరారు చేయాలని, ఏకపక్ష ప్రకటనల ద్వారా కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో భావిస్తోందని పేర్కొన్నారు.

ఇక మరో కాంగ్రెస్ సీనియర్, లోక్‌సభ విపక్షనేత అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ఇండియా కూటమిలో ఎక్కువ కాలం కొనసాగితే మోదీ అసంతృప్తికి గురవుతారని మమతా బెనర్జీ భయపడుతున్నారని ఆరోపించారు. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ కలుపుకోవడం లేదనే సందేశాన్ని పీఎంవో కార్యాలయానికి పంపించారని అన్నారు. కాగా సీట్ల సర్దుబాటు చర్చలకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే వ్యాఖ్యానించింది. అంతలోనే తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై చర్చలు జరిపి గంట గడవకముందే తమ పార్టీ పొత్తుల జోలికి పోకుండా ఏకగ్రీవంగా బరిలో దిగితున్నట్టుగా ప్రకటించిన నాటి నుండి కాంగ్రెస్ పభుత్వం దీదీ తీరుపై మండిపడుతునే ఉంది.





Untitled Document
Advertisements