మమతా బెనర్జీ జారిపడిపోయారు.. ఎస్ఎస్ కేఎమ్ ఆసుపత్రి డాక్టర్లు

     Written by : smtv Desk | Fri, Mar 15, 2024, 04:41 PM

మమతా బెనర్జీ జారిపడిపోయారు.. ఎస్ఎస్ కేఎమ్ ఆసుపత్రి డాక్టర్లు

నిన్నటిరాత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుదుటి పైన గాయంతో ఉన్న ఫోటోలు సంచలనం రేపాయి. ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాలు, ప్రజలు ఆమెకు ఏంజరిగిందోనని ఆందోళన చెందారు. మమతకు గాయమైన ఫోటోలతో పాటు ఆమె కోల్ కతాలోని తన ఇంట్లో జారిపడ్డారని, తలకు బలమైన దెబ్బ తగిలిందని తృణమూల్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి.
అయితే, ఆమెను వెనుక నుంచి ఎవరో తోసి ఉంటారని, అందుకే అంత బలమైన గాయం అయిందని కథనాలు వచ్చాయి. వీటిపై కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎమ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వెనుక నుంచి ఎవరూ నెట్టలేదని స్పష్టం చేశారు. ఆమె తూలి పడ్డారని, అందువల్లే నుదుటికి గాయం అయిందని వివరించారు.
కాగా, మమతా బెనర్జీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. తనకు గాయమైందని తెలియగానే స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ఊపిరి





Untitled Document
Advertisements