నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్
బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి బయల్దేరిన ఆయన నగరంలోని మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు రోడ్ షో కొనసాగనుంది. విజయ్ సంకల్ప్ పేరుతో ఈ రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. రోడ్ షో కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా భారత్ మాతాకీ జై నినాదాలతో మారుమోగుతోంది. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ బీజేపీ శ్రేణులు నినదిస్తున్నారు. మోదీ రోడ్ షో సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ ప్రధాని రోడ్ షో ఆసక్తికరంగా కొనసాగుతుంది.