అభ్యర్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సివిల్స్ ప్రిలిమ్స్, ఫారెస్ట్ సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ మే 26న జరగాల్సి ఉంది. అయితే యూపీఎస్సీ ఆ పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది. ఆ రెండు పరీక్షలను జూన్ 16న నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. లోక్ సభ ఎన్నికల కారణంగానే ప్రిలిమ్స్ తేదీ మార్చినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్ ప్రిలిమ్స్, ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగ నియామకాల కోసం యూపీఎస్సీ గతంలో విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. సివిల్స్ లో 1,056 ఉద్యోగాలు, ఫారెస్ట్ విభాగంలో 150 పోస్టుల భర్తీ చేయనున్నారు. వీటికి దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 6తో ముగిసింది.