ఈ గుడికి వెలితే ఎలాంటి అప్పులు అయినా తీరాల్సిందేనట!

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 10:17 AM

ఈ గుడికి వెలితే ఎలాంటి అప్పులు అయినా తీరాల్సిందేనట!

మధ్య తరగతి కుంటుంబాలలో చాలి చాలని జీతంతో బతకడం చాల కష్టం. పిల్లల చదువులు , ఫంక్షన్స్ , పండుగలు, ఇలా ఎన్నో వాటికీ డబ్బుకు తడుముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. మనకు వచ్చే జీతం సరిపోదు ఇంకా ఏమైనా చేదాము అంటే వయస్సు సహకరించదు దీని వలన చాల మంది అప్పులు చేస్తుంటారు వాటిని తీర్చడానికి ఇబ్బంది పడతారు .అలాంటప్పుడు ఆ దేవుడి కరుణ కటాక్షలు ఉంటే ఇక ఏది అవసరం లేదనేది భక్తుల విశ్వాసం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కొండంతా అండను అందించడానికి తన ఉనికిని అనేక ప్రదేశాలలో వ్యక్తం చేశారు. అందులో ఒకటే ఈ చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధానం. ఇది జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన చిల్పూర్ గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి నడుచుకుంటూ వచ్చి చిల్పూర్ గుట్టపై వెలిశారని చరిత్ర చెబుతుంది. అసలు ఆ స్వామి వారికి ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
పూర్వం ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి వద్ద అప్పు చేస్తారు. ఒకానొక సందర్భంలో ఆ స్వామివారు అప్పును తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు చెల్లించాల్సిన సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆ స్వామివారికి బుగులు(భయం) మొదలైంది. ఆ స్వామి వారి బుగులుతో ఆలోచిస్తూ నిద్రిస్తున్న సమయంలో స్వప్నంలో ఆ స్వామివారికి ఈ చిల్పూర్ ప్రదేశమంతా కనిపిస్తుంది. నిద్ర మేలుకున్న స్వామి వారు ఈ చిల్పూర్ గుట్ట వద్దకు నడుచుకుంటూ వస్తారు. ఈ గుట్ట కింద బాగాన తన పాదరక్షలను వదిలి కొండపై ఉన్న గుహలోకి వెళ్లి ఆ స్వామివారు బుగులుతో తపస్సు చేయడం ప్రారంభిస్తారు.ఆ సమయంలో ప్రత్యక్షమైన కుబేరులు ఆ స్వామి వారిని క్షమాపణ కోరుతారు. ఈ ప్రదేశానికి వచ్చినందుకు గాను నా సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ స్వామివారి సంతోషిస్తారు. అందువలన స్వామి వారు ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి సమస్యల్లో ఉన్న వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తానని బుగులు వెంకటేశ్వర స్వామి వరం ప్రసాదిస్తున్నట్లు తెలుస్తుంది . నిత్యం ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఈ బుగులు వెంకన్న వద్దకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి ఆ బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని తెలుస్తుంది . దీని బట్టి అప్పుల బాధలో ఉన్నవారు ఈ స్వామిని దర్శించుకొని వారికీ ఉన్న కష్టాలు తోలింగించుకోవచ్చు .






Untitled Document
Advertisements