మండే ఎండలతో పాటు తీయ్యటి మామిడి.. మామిడితో టేస్టీ డిజర్ట్ ట్రై చేయండి మరి

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 10:32 AM

మండే ఎండలతో పాటు తీయ్యటి మామిడి.. మామిడితో టేస్టీ డిజర్ట్ ట్రై చేయండి మరి

వేసవి కాలం వచ్చింది అంటే ఎండల వేడితో పాటు కమ్మనైన మామిడి పండ్లను తెస్తుంది . మామిడి పండుకన్నా కమ్మనైన , రుచికరమైన పండు ఏది ఉండదు. అన్ని పండ్లలో కేల్లా రాజా ఎవరు అంటే మాంగోనే అలాంటి మామిడి పండుతో ఎన్నో టేస్టీ వంటలు చేసుకోవచ్చు. మామిడి కాయ పచ్చడి, పులిహోర, రసం అంతేకాకుండా తీయని మామిడి పండుతో పాయసం చేసుకుని చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్ గా ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఇది టేస్టీ డిజర్ట్ అనే చెప్పుకోవాలి. దీన్ని కేవలం పదినిమిషాల్లో చేసుకోవచ్చు. కానీ ఫ్రిజ్‌లో కనీసం రెండు గంటల సేపు ఉంచాలి.


మ్యాంగో ఖీర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:
పాలు - ఒక లీటరు
మామిడి పండు గుజ్జు - ఒక కప్పు
యాలకుల పొడి - అర స్పూను
పంచదార - ఎనిమిది స్పూన్లు
వండిన అన్నం - అయిదు స్పూన్లు
యాలకుల పొడి - చిటికెడు

మ్యాంగో ఖీర్ తయారు చేసే విధానం :
బాగా పండిన మామిడి పండ్లను ఈ పాయసం కోసం ఎంచుకోవాలి. తర్వాత మామిడి పండ్ల నుంచి గుజ్జును తీసి ఒక కప్పులో వేయాలి. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేయాలి. చిన్న మంట మీద వాటిని ఉడికించుకోవాలి. ఆ పాలల్లో ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేయాలి. అందులో పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి.చిన్న మంట మీద ఉంచి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక అందులో మామిడి పండు గుజ్జును వేసి కలుపుకోవాలి. అంతే మ్యాంగో ఖీర్
రెడీ అయినట్లై ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయ్యాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

మామిడి పండులో రోగనిరోధక శక్తినిపెంచే లక్షణాలు ఉంటాయి. దీనిలో బీటాకెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిపండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉంటుంది. మామిడి పండ్లు తినడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు రావు. మామిడి పండు తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకోవచ్చు.
మగవారు మామిడి పండ్లు తినడం వల్ల వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మామిడి పండు తినడం వల్ల చర్మానికి మెరుపు అందుతుంది. పిల్లలకు ఈ పండును పెట్టడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అందులోనూ ఇది ఒక వేసవి సీజనల్ దొరుకుతుంది . కానీ షుగర్ డిసీస్ తో బాధపడే వారు దీన్ని మిత్తంగా తినడం మంచిది . లేదు అంటే డాక్టర్ సలహాతో తీసుకోవడం మంచిది .







Untitled Document
Advertisements