గుడిలో శివుడికి నందికి మధ్య నిలబడకూడదు అంటారు ఎందుకు?

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 11:25 AM

గుడిలో శివుడికి నందికి మధ్య  నిలబడకూడదు అంటారు ఎందుకు?

మనలో చాల వరకు ఎదో ఒక గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే ప్రత్యకంగా శివాలయానికి వెళుతూ ఉంటారు. ఆ శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువు దీరుతాడు. శివుడు శక్తివంతమైన స్వరూపం. నిత్యం లోతైన ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తాడు. శివుని సన్నిధికి వెళ్లే దారిలో కాపలాగా ఉంటాడు నందీశ్వరుడు. శివుడుని ఎవరు కలుసుకోవాలన్న ముందుగా నందీశ్వరుడిని దాటి వెళ్ళాలి.పురాతన కథల ప్రకారం నంది శిలాద మహర్షి కుమారుడు. శిలాధ మహర్షి తీవ్రమైన యజ్ఞం చేయగా ఆ యజ్ఞం నుండే ఈ నంది ఉద్భవించినట్టు చెబుతారు. నందికి శివుని పట్ల అచంచలమైన భక్తి ఉంటుంది. అతను పెరిగే కొద్దీ శివుడి భక్తితో నిండిపోతాడు. ఆ భక్తే అతనిని శివునికి దగ్గర చేసింది. దాని వలన అతడు ద్వారపాలకుడిగా మారాడు . అయితే చాల మంది శివాలయానికి వెళ్ళుతూ ఉంటారు. ఎంతో మంది భక్తులు తెలియక శివుడికి, నందికి మధ్య నిల్చుని నమస్కరిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. శివుడికీ, నందికీ మధ్య ఎవరూ నిల్చోకూడదు. నంది దృష్టి, చూపు ఎప్పుడూ శివుని పైనే ఉంటుంది. వ్యక్తులు శివునికి, నందికి మధ్య నిలబడటం వల్ల నంది దృష్టి నుండి శివుడిని మరల్చినట్టు అవుతుంది. ఇది వారిద్దరి మధ్య భక్తికి అంతరాయం కలిగించడానికి కారణం అవుతుంది. నంది శివుడుని చూస్తూ పూర్తి ధ్యానంలో ఉంటాడు. అతని ముఖం ప్రకాశవంతంగా, నిర్మలంగా ఉంటుంది. శివుని నుంచి వస్తున్న కాంతి ప్రకాశానికి అతను ధ్యానముద్రలో ఉండిపోతాడు. ఎప్పుడైతే ఎవరైనా వారి మధ్య నిలబడతారో నంది ధ్యానానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇలా చేయడం చాలా తప్పు.మీరు చాల సార్లు వైన్ ఉంటారు . దేవాలయాల్లో హారతి ఇచ్చే సమయంలో పురోహితులు ఎన్నోసార్లు నంది, శివునికి మధ్య ఎవరైనా నిలిచి ఉంటే అలా నిల్చోవద్దని పక్కకు వెళ్ళమని చెబుతూ ఉంటారు. నంది మాత్రమే శివుడుని, అతని మహిమను నేరుగా చూడగలడని ఎంతో మంది నమ్మకం. శివుడు, నంది మధ్య ఉన్న విలువైన బంధం వారి మధ్య ఎవరిని నిలబడనీయకుండా చేస్తుంది. ఇది ప్రేమ, విశ్వాసంతో కూడిన బంధం. కావున ఎప్పుడైనా మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి, నందికి మధ్యలో నిలబడకండి. ఎవరైనా అలా ఉన్న చెప్పండి. ఆ నందీశ్వరుడి అనుగ్రహం పొందండి .





Untitled Document
Advertisements