ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లర్‌

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 03:32 PM

ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లర్‌

టాలీవుడ్ లో ఆపరేషన్‌ వాలంటైన్ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మానుషి చిల్లర్‌.ఈ అమ్మడుప్రపంచ సుందరి పోటీలలో పాల్గొని 67వ ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకుంది. భారత్‌ తరపున ఈ కిరీటం దక్కించుకున్న ఆరవ యువతిగా మానుషి చిల్లర్‌ నిలిచింది. ఈ అమ్మడికి ముందు నుండి మోడలింగ్ అంటే చాల ఇష్టం . అందువలన మోడలింగ్ నుంచి బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు. మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. టాలీవుడ్‌ లో ఈ అమ్మడు చేసిన మొదటి ప్రయత్నం కమర్షియల్‌ గా నిరాశ పరిచింది. దాంతో మళ్లీ ఈ అమ్మడికి తెలుగు లో ఆఫర్లు వస్తాయా అంటే డౌటే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల్లో ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో తన క్యూట్‌ అందాల ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పొట్టి బ్లాక్ డ్రెస్ లో మానుషి చిల్లర్‌ అందం అదరహో అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందంగా ఉన్న మానుషికి టైం కలిసి రావడం లేదని, ముందు ముందు అయినా ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలలో నటించే అవకాశము వస్తుందో చూడాలి మరి.





Untitled Document
Advertisements