క్షీరసాగరమధనం తర్వాత అమృతం వెలువడినప్పుడు దానిని దేవతలకు మాత్రమే పంచుటకు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారమెత్తి రాక్షసులను సమ్మోహితులను చేసి దేవతలకే అమృతమంతాయు పంచి పెట్టెను. శివుడు ఈ రూపమును చూడదలచి మరల ఆ రూపమును పొందమని విష్ణువును కోరగా శ్రీకృష్ణుడు జగన్మోహినిగా మారాడు. అప్పుడు శివుడు ఆమె అందానికి ముగ్థుడై జగన్మోహినితో రతిక్రీడ సల్పగా ఆమెకు వచ్చిన చెమట నదీ రూపము దాల్చింది. ఈమెకు పుట్టిన పుత్రుడే మణికంఠుడు (అయ్యప్ప).