శచీదేవి పులోముడి కుమార్తె, ఇంద్రుని భార్య, ఈమె కుమారుడు జయంతుడు, కుమార్తె జయంతి. సహోదరుడు ఇంద్రుడైనప్పుడు శచీదేవిని తన కోరిక తీర్చమనగా సప్తర్షుల శాపముతో ఆమె ఆపద నుండి బయట పడింది. శచీదేవి అంశే పాండవుల భార్య ద్రౌపది. ఈమె గొప్ప ఆసనంపై ఇంద్రుని సభలో ఆసీనురాలై ఉంటుంది. ఈమె శ్రీకృష్ణుడ్ని, సత్యభామను దేవమాత వద్దకు తీసుకు వెళ్ళింది. ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకంతో దేవలోకం నుండి వెళ్ళినప్పుడు ఈమె బృహస్పతి సంరక్షణలో ఉంది. ఈమె సుబ్రమణ్య స్వామి జన్మించిన సమయంలో అక్కడే ఉంది.