ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు ..

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 04:20 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు ..

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస నిర్వాసితుల సోము వీర్రాజు పర్యటించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రాష్ట్రంలో అధికార పార్టి ఇసుకను మట్టిని అమ్ముకుంటూ ఆ సొమ్మును కాజేస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రాన్ని బుద్దిలేని వారు పాలిస్తున్నారని ఎద్దేవా చేసారు. కొందరు నేతలైతే పాదయాత్రలు చేసి రోడ్లు అరిగిపోయి ఆగం అవుతున్నాయని ఆయన ప్రభుత్వ తీరుపై ఎద్దేవా చేసారు. ఆంధ్సొంరప్తరదేశ్ ముఖ్యమంత్రి జిల్లా కడపలో కూడా ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారని చెప్పారు. మడ్డువలస రిజర్వాయర్ నిర్వాసితులతో పాటు అన్ని నిర్వాసిత గ్రామాలను తాము అభివృద్ధి చేస్తామని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు . అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపి ప్రభావం అంతగా లేనప్పటికీ సోము వీర్రాజు పర్యటనలు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఎంత ప్రయోజనం చేకూరుస్తాయని అంతగా ఏమి ఉండదు అనే వాదననే వినిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రలో భీజేపి లేనట్లుగా ఉంది .







Untitled Document
Advertisements