నేడు తెలుగు రాష్ట్రాల్లో మాంసం మరియు మద్యం షాపులు క్లోజ్

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:30 AM

నేడు తెలుగు రాష్ట్రాల్లో మాంసం మరియు మద్యం షాపులు క్లోజ్

మద్యం ప్రియులకు షాకింగ్ లాంటి వార్త ఇది. నేడు అనగా ఆదివారం రెండు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు మరియు మాంసం దుకాణాలు కూడా ముసివేయపడ్డాయి.
మహాత్మా గాంధీ జయంతి రోజును పునస్కరించుకుని ప్రతీ ఏటా అక్టోబర్ 2న ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రతీసారి లాగే ఈ సారి కూడా మద్యం, మాంసం షాపులు బంద్ అవుతాయి. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన మందుబాబులు నినన్నే మద్యం షాపుల వద్ద క్యూ కట్టారు. పైగా ఆదివారం కావడంతో సెలవును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు కూడా ముందుగా జాగ్రత్త పడ్డారు. మరికొందరు వ్యాపారులు ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించి మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు సమాయాత్తమయ్యారు.





Untitled Document
Advertisements