గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి దేశాన్ని ఏకం చేస్తాం.. రాహుల్ గాంధీ

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:00 PM

గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి దేశాన్ని ఏకం చేస్తాం.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ " ఏ విధంగా మహాత్మా గాంధీ అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసారో, అలానే మేము భారతదేశాన్ని ఏకం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము" అని అన్నారు . "బాపు మాకు సత్యం మరియు అహింస మార్గంలో నడవాలని నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం మరియు మానవత్వం యొక్క అర్థాన్ని ఆయన వివరించారు" అని కాంగ్రెస్ నాయకుడు హిందీలో ట్వీట్ చేశారు. "ఈ రోజు గాంధీ జయంతి నాడు, ఆయన అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసినట్లే, మన భారతదేశాన్ని ఏకం చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము" అని కాంగ్రెస్ మాజీ చీఫ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ బోడో యాత్ర మరియు మహాత్మా గాంధీ యొక్క వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు.





Untitled Document
Advertisements