త్వరలో ప్రారంభం కానున్న గూఢాచారి-2 షూటింగ్..

     Written by : smtv Desk | Wed, Jan 11, 2023, 12:41 PM

త్వరలో ప్రారంభం కానున్న గూఢాచారి-2 షూటింగ్..

గత సంవత్సరం విడుధలైన మేజర్, హిట్-2 చిత్రాల ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న అడవి శేష్.. ప్రస్తుతం 2018 లో వచ్చిన చ్చిన గూఢాచారి మూవీ సేక్వేల్ చేస్తున్నారు.. అయితే అప్పట్లో ఆ సినిమాకి కథ అందించిన అడవి శేష్.. సీక్వెల్‌కి కూడా స్టోరీ ఇచ్చాడు.. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోను సోమవారం విడుదల చేశారు. అయితే.. మంగళవారం ప్రీవిజన్‌ పేరుతో ఒక ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ ప్రీవిజన్ ఈవెంట్‌‌లో అడివి శేష్ మాట్లాడుతూ ‘జీ2 ఆల్ ఇండియా ఫ్రాంఛైజీగా మారబోతోంది. 2018లో వచ్చిన గూఢాచారి మూవీ తర్వాత దక్షిణాదిన స్పై సినిమాల సంఖ్య మళ్లీ పెరిగింది. గూఢాచారి-2 మూవీ స్క్రిప్ట్‌పై కనీసం రెండు నెలలు పనిచేయాల్సి ఉంది. ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్తాం. ఈ మూవీని ఐదు దేశాల్లో షూట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఇండియాతో పాటు యూరప్, మిడిల్ ఈస్ట్ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు. మేజర్ సినిమాకి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. అతని కోరిక మేరకు సిక్స్ ప్యాక్ చేయబోతున్నట్లు అడివి శేష్ వెల్లడించాడు. అతను కోరుకున్న విధంగా లుక్ వచ్చిన తర్వాతే షూటింగ్‌కి వెళ్తామని కూడా ఈ యంగ్ హీరో స్పష్టం చేశాడు. అయితే.. ఇలా ప్రీవిజన్‌ ఈవెంట్ పెట్టడానికి అసలు కారణం మేం ఏం ఊహించుకుంటున్నామో ప్రేక్షకులకి చూపించాలని అనుకోవడమేనని అడవి శేష్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి శ్రీచరణ్‌ పాకాల మ్యూజిక్ డైరెక్టర్‌కాగా.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించిన అడవి శేష్.. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయి సినిమా రెడీ అయ్యేందుకు కనీసం ఏడాన్నర టైమ్ పడుతుందని చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా మూవీని 2024లో రిలీజ్ చేస్తామని.. గూఢాచారి-2 ( జీ2) కచ్చితంగా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందని అడివి శేష్ ధీమా వ్యక్తం చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.





Untitled Document
Advertisements